భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బీబీనగర్ మండలం గూడూరు జడ్పీహెచ్ఎస్లో జీసీఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ గూడూరు మహేందర్రెడ్డి రూ.42లక్షలతో ఏర్పాటుచేసిన డిజిటల్ లైబ్రరీని మంత్రి బుధవారం ప్రారంభించారు. అనంతరం బీబీనగర్ జడ్పీహెచ్ఎస్లో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు
రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యాయన్నారు. మౌలిక వసతుల కల్పనతో అన్ని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఎన్ఆర్ఐలు సొంతూళ్లలోని పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు. గూడూరు మహేందర్రెడ్డి, శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సేవలను అభినందించారు. కార్యక్రమాల్లో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి పాల్గొన్నారు.
బీబీనగర్, ఆగస్టు 3 : విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మండలంలోని గూడూరు గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో జీసీఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ గూడూరు మహేందర్రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్ధం రూ. 42 లక్షలతో నిర్మించిన డిజిటల్ గ్రంథాలయాన్ని బుధవారం సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలనే ఆలోచనతో గ్రంథాలయాన్ని నిర్మించి విద్యార్థులకు లెర్నింగ్ స్కిల్స్ను పెంపొందించడానికి కృషి చేస్తున్న ఎన్ఆర్ఐ గూడూరు మహేందర్రెడ్డి సేవలు అభినందనీయం అన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడుతూ బడి బయట పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. జీసీ ఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ గూడూరు మహేందర్రెడ్డి మాట్లాడుతూ తన పిల్లలకు అందిస్తున్న చదువును ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించాలనే గ్రంథాలయాన్ని నిర్మించానని తెలిపారు.
ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
బీబీనగర్( భూదాన్పోచంపల్లి) : భూదాన్పోచంపల్లి మండలంలోని దేశ్ముఖి గ్రామంలోని సాయి బృందావనంలో అష్టభుజ ఆలయం నిర్మాణ పనులను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయి బాబా ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పోచంపల్లి ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలతా మల్లారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ సూరజ్ కుమార్, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, తాసీల్దార్ వీరాబాయి, సర్పంచ్ దుర్గం స్వప్నానరేశ్, ఎంపీటీసీ చిల్లర జంగయ్య, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్రెడ్డి, సామ రవీందర్రెడ్డి, అందెల హరిశ్ యాదవ్, పగిళ్ల సుధాకర్రెడ్డి, ముత్యాల మహిపాల్రెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.
రాగి జావా పంపిణీ ప్రారంభం
బీబీనగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థ్దులకు ప్రతి రోజు ఉదయం అల్పాహారంగా రాగి జావా విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధ్దికి చిత్తశుద్ధి కృషి చేస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాతో పాటు మరిన్ని జిల్లాల్లో సుమారు లక్ష మందికి రాగి మాల్ట్ పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన సత్య సాయి ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీఈఓ నారాయణరెడ్డి, ఎంపీపీ సుధాకర్గౌడ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్థాయీ సంఘం చైర్పర్సన్ జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్రెడ్డి, సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి, ఎంపీటీసీ స్వప్నారాజశేఖర్గౌడ్, ఎంఈఓ నాగవర్ధ్దన్రెడ్డి, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.