నల్లగొండ, జనవరి 30 : 2022-23 సంవత్సరానికి సంబంధించిన యాసంగి సీజన్ కస్టం మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)ను వేగంగా అందజేయాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు మిల్లర్లను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రామ్లక్ష్మణ్ మిల్లులో మంగళవారం బియ్యం నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-23 సంవత్సరానికి సంబంధించిన సీఎమ్మార్ ఇప్పటి వరకు వంద శాతం పూర్తి చేశామన్నారు.
ఇదే ఏడాదికి సంబంధించిన యాసంగి సీఎమ్మార్ను కూడా త్వరలోనే సేకరిస్తామని చెప్పారు. అన్ని మిల్లుల్లో ధాన్యం నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించి సేకరించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట సివిల్ సైప్లె డీఎం నాగేశ్వర్రావు ఉన్నారు.