రాదనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారు. ఏ వర్గానికి ఏం కావాలో తెలుసుకొని అందరికీ అన్నీ అందిస్తున్నారు. సంక్షేమ ఫలాలతో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారు. స్వరాష్ట్రంలో కవులు, కళాకారులను గుర్తించి సముచిత స్థానం కల్పించారు. తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తిన కళాకారులకు సర్కారు కొలువులిచ్చారు. ఇలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి వెళ్తే సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని కవులు, కళాకారులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనా వైఫల్యంతో రాజకీయ శూన్యత ఏర్పడిన తరుణంలో కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని పేర్కొంటున్నారు.
– సూర్యాపేట, సెప్టెంబర్ 22, (నమస్తే తెలంగాణ)
దశాబ్దాల తరబడి తెలంగాణ దోపిడీ, అణచివేతకు గురైంది . కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పయనిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాష, యాసలతో పాటు కళలు, కళాకారులకు కనీస గుర్తింపు లేదు. నేడు అన్ని రంగాల్లో సముచిత స్థానం లభిస్తున్నది. పేరిణి లాంటి నృత్యానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రాగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను సాంస్కృతిక కళాకారులుగా గుర్తించి నేడు ఒక్కొక్కరికీ రూ.31 వేల వేతనం ఇస్తున్నారు. అలాగే వృద్ధ్ద కళాకారులకు రూ.3,016లు నెలనెలా ఇస్తుండడంతో వారి సంతోషాలకు అవధుల్లేవు. ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్లో నిర్వహించి మన సాహితీవేత్తల వైపు ప్రపంచమే తిరిగి చూసేలా చేశారు. ఉమ్మడి జిల్లాలో నల్లగొండకు చెందిన వేణు సంకోజుకు దాశరథి అవార్డు, ఆలేరుకు చెందిన హరగోపాల్కు కాళోజీ అవార్డులతో పాటు పారితోషికం ఇచ్చారు. తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాల్లో కవులు, కళాకారులను ఘనంగా సత్కరిస్తున్నారు. సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే దేశం బాగుపడడం ఖాయమని పలువురు కవులు, రచయితలు, కళాకారులు అభిప్రాయపడుతున్నారు.
స్వరాష్ట్రంలో కవులు, కళాకారులకు గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కవులు, కళాకారులకు సరైన గుర్తింపు, సముచిత స్థానం లభించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి రాష్ట్రంలోని కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి ఔత్సాహిక కవులు, రచయితలను ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కవులు, కళాకారులు అబ్బురపడేలా ప్రపంచ తెలుగు మహాసభలు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించారు. గ్రంథాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకొన్నారు. లైబ్రరీల సొంత భవనాల నిర్మాణాల కోసం నిధులు కేటాయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంటిత దీక్షా దక్షతలకు ఇవి అద్దం పడుతాయి.
– బండారు జయశ్రీ, యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి (భువనగిరి కలెక్టరేట్)
దేశ స్థితి గతులను మార్చగల సమర్థుడు
14 ఏండ్ల సుదీర్ఘపోరాటం అందరి భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్. తెలంగాణలో జన రంజక పాలన సాగిస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి సంక్షేమ పథకాలను అందిస్తూ మన రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా ఉంచారు. ఇదే ఒరవడిలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశంలోని స్థితి గతులను మార్చగల సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆయన. సాహిత్యం, భాష పటిమ, సాహితీ వేత్తగా ప్రజల్లో రాణించే అనుభవం, నాయకత్వ లక్షణాలున్నాయి. యావత్ భారతం ఇప్పుడు సీఎం కేసీఆర్వైపు చూస్తున్నది. అందుకే ఆయన దేశ్కీ నేతగా రావాలని పలు రాష్ర్టాల ప్రజలు ఆహ్వానిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమానికి రైతుబీమా, రైతు బంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పలు పథకాలను అమలు చేస్తున్నారు. ఇలాంటి పథకాలు దేశంలో అమలు జరుగాలంటే కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడు అవసరం అని దేశ ప్రజలు భావిస్తున్నారు.
– పెరుమాళ్ల ఆనంద్, కవి, రచయిత, నల్లగొండ ,(రామగిరి)
తెలంగాణ రాష్ట్రం వచ్చాకే కవులకు గుర్తింపు
ప్రజల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ర్టాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం. సీఎం కేసీఆర్ పాలనలో కవులు, రచయితలు, కళాకారులకు గుర్తింపు వచ్చింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కవులకు అవార్డులు ప్రదానం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఇలాంటి విజన్ ఉన్న నాయకుడు దేశ రాజకీయాల్లో వెళ్తే గొప్ప మార్పు వస్తుంది. అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి జాతీయస్థాయిలో కీలకంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న కేసీఆర్ వల్లే ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలంటే దేశ రాజకీయంలోకి కేసీఆర్ రావాలి.
– బండ జహంగీర్, యువ కవి, పటేల్గూడెం(ఆలేరు రూరల్)
సీఎం కేసీఆర్తోనే కళాకారులకు సముచిత న్యాయం
ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి సీఎంగా కేసీఆర్ అయిన తరువాత కళాకారులకు సముచిత స్థానం కల్పించి మమ్మల్ని అన్నిరకాలుగా ఆదుకున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుంది. రాష్ట్ర పథకాలు దేశ ప్రజలకు అందాలి అంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందినట్లే దేశం మొత్తం అభివృద్ధి సాధించాలంటే అది కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యం. దేశ సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్న కేసీఆర్ వంటి నాయకుడు దేశ రాజకీయాల్లో రాణించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం శుభసూచకం
సాధ్యం కాదన్న తెలంగాణ రాష్ర్టాన్ని పోరాటంతో సాధించిన వ్యక్తి సీఎం కేసీఆర్. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో అమలైతే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి జరుగుతుంది. పథకాలను ఇతర రాష్ర్టాల సీఎంలు, నాయకులు, అధికారులు ఆదర్శంగా తీసుకుని అమలుకు సిద్ధమవుతున్నారు. వీటిని అమలు చేసే దేశ నాయకత్వం కావాలని అందరూ కోరుకుంటున్న తరుణంలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం శుభ సూచకం. మరో వైపు రాష్ట్రం ఏర్పడిన తరవాత ఇక్కడి కవులు, కళాకారులు, సాహితీ వేత్తలకు మంచి గుర్తింపు వచ్చింది. అవకాశం ఉన్నప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుని సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవడం అభినందనీయం. తెలంగాణలోని కవులు, కళాకారుల కీర్తిని జాతీయ స్థాయిలో తీసుకెళ్ల్లింది. మరో వైపు తెలంగాణ వైతాళికులను సైతం వెలుగులోకి తెచ్చింది సీఎం కేసీఆరే. తెలంగాణ మాదిరిగానే దేశాన్ని ముందుకు నడిపించడంలో సమర్థ్ధవంతమైన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అందరూ భావిస్తున్నారు. తెలంగాణ తరహాలో దేశ భవిష్యత్ మార్చే సత్తా ఉన్న నేత కేసీఆర్.
– పున్న అంజయ్య, ప్రముఖ సాహితీ వేత్త, నల్లగొండ
చరిష్మా ఉన్న నాయకుడు కేసీఆర్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి తెలుగు భాషా కీర్తిని ప్రపంచంలో చాటి చెప్పాడు. కవులు,కళాకారులు, రచయితలను ఎంతో ప్రోత్సహించి మన సాహితీ సాంస్కృతిక సంప్రదాయాలకు అభివృద్ధ్ది చెందే విధంగా ప్రోత్సహించిన సీఎం కేసీఆర్ కళామతల్లి ముద్దుబిడ్డలుగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్లడంతో రచయితల, కవుల, కళాకారుల కళలు సాకారమవుతాయి. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో కవులు, కళాకారులను ఎంతో గొప్పగా సన్మానించారు. గతంలో కళాకారులు స్వీకరించదగ్గ గౌరవం, కవులు,కళాకారులంటే పట్టింపులేదు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే దేశంలోని కవులు,కళాకారుల కూడా మంచి గౌరవం, గుర్తింపు దక్కుతున్నది. పట్టుదలతో అభివృద్ధి చేసే వ్యక్తి దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకువస్తారు.దేశంలో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి దేశ ప్రజల అభ్యున్నతికి కృషిచేస్తారని నమ్మకం.
– కర్ల శ్రీనివాస్, కవి,రచయిత, గాయకుడు,ఆర్టీసీ కళా బృందం సభ్యుడు (మఠంపల్లి)
కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలి
అకుంటిత దీక్షతో సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించారు. రాష్ర్టాన్ని అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించి, దేశంలో అగ్ర భాగంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. దూర దృష్టి ఉన్న నాయకుడు కేంద్రంలో లేక పోవడం వల్ల భారత దేశం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలి. తెలంగాణ రాష్ట్రం తరహాలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో రాణించడానికి మా కవులు, కళాకారులు, రచయితల పూర్తి సహకారం అందిస్తాం.
– పెసరు లింగారెడ్డి, కవి, రచయిత, చల్లూరు, జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు,(రాజాపేట)
తెలంగాణ కళాకారులుగా గర్వపడుతున్నాం
రాష్ట్రం ఏర్పడిన తరువాత కళాకారులకు గుర్తింపు వచ్చింది. ఎక్కడకు పోయినా తెలంగాణ కళాకారులమని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. ఉద్యమంలో కేసీఆర్ పోరాటానికి అండగా ఉండి ఉద్యమానికి ఊతం ఇచ్చింది కళాకారులే. అందుకు తగ్గుట్టుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ కళాకారులను గుర్తించి సీఎం కేసీఆర్ తగిన ప్రోత్సాహం ఇస్తున్నారు. పేద కళాకారులకు పింఛన్ అందిస్తూ ఆదుకుంటున్నారు. ఒకప్పుడు సినిమాల్లో తెలంగాణ భాష, యాసను కేవలం విలన్లకు మాత్రమే పరిమితం చేశారు. సీఎం కేసీఆర్ వల్లనే సినిమాలు, టీవీ సీరియళ్లు, సోషల్ మీడియాలో తెలంగాణ యాస, భాషకు మంచి గుర్తింపు వచ్చింది. హీరోలు, హీరోయిన్లు కూడా తెలంగాణ భాష, యాసను అనుకరిస్తున్నారు. మన పండుగలు, సంస్కృతి, జానపాద పాటలకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇది కేవలం సీఎం కేసీఆర్ వల్లే.
– ఎండీ ఇనాయ్తుల్లా,వాడపల్లి, (దామరచర్ల)