అసెంబ్లీలో మన నేతలు
గురువారం ప్రారంభం కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యారు. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించిన గవర్నర్ ప్రసంగం ఉండగా, ఆ సారాంశాన్ని మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి చదువుతున్న దృశ్యమిది.
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. శాసన మండలి, శాసన సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ఈ సమావేశాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.