సూర్యాపేటఅర్బన్, డిసెంబర్ 5 : విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేందర్రావు అన్నారు. సూర్యాపేటలో మూడ్రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను సోమవారం స్థానిక ఏవీఎం పాఠశాలలో కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్తో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ మేథాశక్తిని ప్రదర్శించేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి రావ డం అభినందనీయమన్నారు. విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో జిల్లాలోని ప్రతి పాఠశాలకు సైన్స్ పరికరాలు అందించామని ఇంకా ఏ పాఠశాలకైనా అవసరముంటే ఏర్పాటు చేస్తామన్నారు. కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇన్నోవేషన్లో మన రాష్ట్రం దేశంలో టాప్-5లో ఉందని అన్నారు. సైన్స్ఫెయిర్లో ప్రదర్శనకు వచ్చిన విద్యార్థులు, తిలకించేందుకు వచ్చిన విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రదర్శన కమిటీలకు కలెక్టర్ సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ మాట్లాడుతూ గురువులచే శిక్షణ పొందిన విద్యార్థ్ధులు పెద్ద ఎత్తున సైన్స్ ప్రదర్శనలు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్ మాట్లాడుతూ సైన్స్ పండుగకు జిల్లా వ్యాప్తంగా 800 మంది విద్యార్థులు 518 ప్రదర్శనలు తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.
సైన్స్ ప్రదర్శనను తిలకించేందుకు హాజరైన విద్యార్థులు
ఈ ప్రదర్శనల్లో 50 ఇన్స్పైర్ అవార్డుకు, రాష్ట్ర స్థాయికి జూనియర్స్ నుంచి 7, సీనియర్స్ నుంచి 7 ప్రదర్శనలను జ్యూరీ మెంబర్స్ పర్యవేక్షించి పరిశీలించి ఎంపిక చేస్తారన్నారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులు ప్రదర్శనలను తిలకించారు. అంతకు ముందు బతుకమ్మ ఆటపాటలు, డప్పు చప్పుళ్లు, కోలాట నృత్యాలతో విద్యార్థులకు అతిథిధులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సురేశ్, డీఈఓ అశోక్, ఏడీ శైలజ, ప్రముఖ పారిశ్రామికవేత్తలు మీలా మహదేవ్, మీలా వాసుదేవ్, సైన్స్ ఎగ్జిబిషన్ కన్వీనర్ చత్రునాయక్, కో-కన్వీనర్లు ఎన్.రవి, గోపాల్రావు, సలీంషరీఫ్, ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు మారం లింగారెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు కోటిరెడ్డి, రస్మా అధ్యక్షుడు వెంపటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.