సూర్యాపేట జిల్లాను ఆదివారం దట్టమైన పొగ మంచు కమ్మేసింది. ఉదయం 9గంటలు అయినా సూర్యుడు దర్శనమివ్వలేదు. దాంతో ఎటు చూసినా ఏమీ కనిపించని పరిస్థితి ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా.. రైతులు ఎప్పట్లాగే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మంచుతోపాటు చలి
ఉన్నప్పటికీ ఉదయాన్నే రోజువారీ పనులకు వెళ్లారు. వాహనదారులు లైట్ల వెలుతురులో తమ ప్రయాణాన్ని సాగించారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నమస్తే తెలంగాణ, సూర్యాపేట