సూర్యాపేట రూరల్, జనవరి 30 : పల్లె దవాఖానల పేరుతో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఎంబీబీఎస్ డాక్టర్ల పల్లెల్లో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్క వైద్యమే గాక ఏ రంగం తీసుకున్నా దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. సూర్యాపేట మండలం రామచంద్రాపురం, రామారం గ్రామాల్లో రూ.2 కోట్ల 64లక్షలతో ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్లకు మంత్రి సోమవారం రాత్రి శంకుస్థాపన చేశారు. రామారంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ పైరవీలకు తావు లేకుండా పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని, బీఆర్ఎస్కు మద్దతుగా గ్రామాలకు గ్రామాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పల్లె దవాఖానలతో గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలంలోని రామచంద్రాపురం, రామారం గ్రామాల్లో రూ.2.64కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లకు సోమవారం శంకుస్థాపన చేశారు. రామారంలో రూ.15లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి మందుల కిట్లు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చిన్న చిన్న అనారోగ్య కారణాలు సీరియస్గా మారి పల్లె ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న నేపథ్యంలో వారి ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను ఏర్పాటు చేసిందన్నారు.
పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను నేరుగా అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు బీఆర్ఎస్కు మద్దతుగా గ్రామాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైద్యంతోపాటు ఏ రంగం తీసుకున్నా దేశంలో తెలంగాణే నంబర్ వన్గా ఉన్నదన్నారు. అందుకే దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. పైరవీలకు తావు లేకుండా సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజలకు అందజేస్తున్న ప్రభుత్వం ప్రపంచంలో తెలంగాణ ఒక్కటే ఉన్నదన్నారు. ఏ సందర్భంలోనైనా కేసీఆర్కు, బీఆర్ఎస్కు మద్దతుగా నిలువాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2014కు ముందు గ్రామాల్లో జరిగిన అభివృద్ధి శూన్యమని, వివిధ కండువాలతో గ్రామాల్లోకి వస్తున్న ఆ నాయకులను నిలదీయాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్ పాలనే మనకు శ్రీరామరక్ష అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, సర్పంచ్ సుమతీనాగరాజు, సుమన్, మాలి అనంతరెడ్డి, కవిత, నవీన్గౌడ్ పాల్గొన్నారు.