ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు(1 నుంచి 9వ తరగతి వరకు) ప్రభుత్వం మంగళవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఆయా తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 20 వరకు ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించారు. చివరి రోజు సోమవారం ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేసి తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల ప్రగతి గురించి చర్చించారు.
విద్యార్థులు తమ ఫలితాలను చూసుకుని సంబరపడ్డారు. జూన్ 11 వరకు 48 రోజులపాటు సెలవుల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఇంటిదారి పట్టారు. జూన్ 12న పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం కానుండగా జూన్ మొదటి వారంలో బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు.
– రామగిరి/నకిరేకల్, ఏప్రిల్ 24