నార్కట్పల్లి మే 12 : బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై పోక్సో కేసు నమోదైతే స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ నాయకులు నార్కట్పల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మాట్లాడు తూ బండి సంజయ్ కొడుకును కాపాడేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది సిగ్గుచేటన్నారు.
సామాన్యులను ఒకలా మంత్రి కొడుకుకు మరో లా న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. కేసు నమోదై నాలుగు రోజులైనా ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. భగీరథ్ను కాపాడేందుకు రేవంత్ పరోక్షంగా సహకరిస్తున్నారని, బీజేపీ కాంగ్రెస్ రహస్య ఒప్పందం బయట పడిందన్నారు. తక్షణమే సంజయ్ని బర్తరఫ్ చేసి భగీరథ్ను శిక్షించాలని డిమాండ్ చేశారు.