అభివృద్ధి చేశారని, ప్రజలకు గులాబీ జెండానే కొండంత అండ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో పట్టణానికి చెందిన 19, 34, 35 వార్డుల నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు సమీపించగానే కొత్త బిచ్చగాళ్లలాగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు వచ్చి ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ తిరుగులేని పాలనతో విపక్షాల్లో వణుకు మొదలైందని, అందుకే ఆయా పార్టీల నాయకులు దిక్కుతోచని స్థితిలో నెరవేర్చలేని హామీలతో తిరుగుతున్నారని విమర్శించారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 8 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధితో అన్ని ప్రాంతాల రూపురేఖలు మార్చిన బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండాయే అందరికీ కొండంత అండ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆ నమ్మకంతోనే అంతా ఆయా పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 19, 34, 35 వార్డుల నుంచి కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 450 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపించగానే కొత్త బిచ్చగాళ్లలాగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు వచ్చి ఇస్తున్న హామీలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు.
ఎన్నో ఏండ్లు పాలించినోళ్లు ఆనాడు ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా ఇప్పుడేదో కొత్తగా చేస్తామంటే నవ్వుకుంటున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అతి తక్కువ సమయంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి నేడు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. అటువంటి వినూత్న రీతిలో అందుతున్న సంక్షేమ, అభివృద్ధిని ప్రజలే స్వచ్ఛందంగా వివరిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్కు ఓటు వేసినంకనే ప్రజలందరి తలరాతలు మారినాయని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని పాంతాల్లో లబ్ధిపొందని ఏ ఒక్క ఇళ్లుందా అని ప్రశ్నించారు. గత పదేండ్లుగా ఎవరూ ఊహించని రీతిలో కొనసాగుతున్న అభివృద్ధితో సీఎం కేసీఆర్ నాయకత్వంపై మరింత విశ్వాసం పెంచుకున్నారని.. ఇచ్చిన హామీలే కాకుండా అవసరమనుకుంటే అదనంగా అమలు చేసిన ఘనత ఒక్క బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. అందుకే అభివృద్ధి నిరోధక పార్టీల్లో ఇంకా కొనసాగలేమని ఆయా పార్టీలకు స్వస్తి చెప్పి బీఆర్ఎస్ గూటికి స్వచ్ఛందంగా వలస వస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు జ్యోతీకరుణాకర్, ఎంఏ అజీజ్, తాహెర్ పాషా పాల్గొన్నారు.