‘పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోలేదు. ప్రధాని మోదీ ప్రభుత్వ ఆస్తులను అమ్ముతుంటే.. సీఎం కేసీఆర్ దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేస్తున్నరు. పన్నెండున్నర కోట్ల రూపాయలకు హ్యాండ్లూమ్ పార్కును కొని ప్రభుత్వపరం చేశాం. బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం. అవసరమైతే మరో రూ.10కోట్ల నుంచి 15కోట్లు ఖర్చు చేస్తం. దాన్నుంచి వచ్చే లాభాలను పోచంపల్లి మండలంలోని ప్రతి నేత కుటుంబానికీ అందిస్తం. పార్కుపై ఓనర్షిప్ ప్రభుత్వానిది కాదు. నేతన్నలకే ఒప్పజెప్పుతాం’ అని రాష్ట్ర చేనేత, ఔళిశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లిలో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ను ప్రారంభించారు. పట్టణంలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించారు. అటునుంచి అధికారులతో కలిసి కునముక్కులకు చేరుకుని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును సందర్శించారు. అనంతరం నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేనేత వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన సభకు హాజరై ప్రసంగించారు. నేతన్నకు ప్రతీక మగ్గం అని, అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన చేనేత కళాకారులు మన దగ్గర ఉన్నారని కొనియాడారు. చేనేత రంగాన్ని కాపాడుకుందామని ప్రజాప్రతినిధులు, నేత కార్మికులతో మంత్రి కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు.
-యాదాద్రి భువనగిరి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)
దివాలా తీసిన సంస్థను రూ.12.50 కోట్లతో సర్కారే కొన్నది మరో రూ.15 కోట్లయినా ఖర్చు చేసి బాగు చేస్తం అందులో వచ్చిన లాభాలన్నీ నేత కుటుంబాలకే ఇస్తం కార్మికులందరూ బాగుపడాలనేదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష పోచంపల్లి ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలి త్వరలో చేనేత సహకార సొసైటీలకు ఎన్నికలు స్వరాష్ట్రంలో మారిన పోచంపల్లి రూపురేఖలు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ పోచంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. నేతన్న విగ్రహావిష్కరణ కనుముక్కులలో హ్యాండ్లూమ్ పార్కు సందర్శన
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : మగ్గం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలుసని, ఆయన స్వయంగా దుబ్బాకలో ఓ నేత కార్మికుడి ఇంట్లో ఉండి చదువుకున్న వ్యక్తిగా మగ్గం చప్పుడు.. నేతన్న గుండె చప్పుడూ తెలుసని రాష్ట్ర చేనేత, ఔళి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. భూదాన్ పోచంపల్లిలో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ను ప్రారంభించారు. పట్టణంలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కనుముక్కుల గ్రామంలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును అధికారుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేనేత వారోత్సవాల్లో భాగంగా ఓ ఫంక్షన్లో జరిగిన సభకు హాజరై ప్రసంగించారు. 2001లో నేతన్నలను కాపాడుకోవడానికి భూదాన్ పోచంపల్లిలో నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ జోలె పట్టారని, సిరిసిల్లలో కార్మికులు చనిపోతే పార్లమెంట్ సభ్యుడిగా ఆదుకున్నారని గుర్తు చేశారు. వ్యవసాయం తర్వాత చేనేత రంగమే పెద్దదని మంత్రి చెప్పారు. పద్మశాలీలకు కోకాపేటలో రెండున్నర ఎకరాల స్థలం ఇచ్చామని, అది ఈ రోజు రూ.250 కోట్ల విలువ చేస్తున్నదని చెప్పారు. నేతన్నల కోసం హ్యాండ్లూమ్, పవర్లూమ్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. కార్మికులందరూ బాగుపడాలనేదే తమ ఆకాంక్ష అని, త్వరలో సొసైటీలకు ఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. పోచంపల్లి మున్సిపాలిటీ ఇప్పుడు ఎట్లయ్యిందో ఆలోచన చేయాలని సూచించారు. బ్రహ్మాండంగా రూపుదిద్దుకున్నదని, మంచి రోడ్లు, సెంట్రల్ లైట్లు, సీసీ రోడ్లు అద్భుతంగా మారాయని చెప్పారు.
ఆత్మీయ పలుకరింపులు.. హత్తుకొని ముచ్చట్లు
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : భూదాన్ పోచంపల్లిలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ఉత్సాహంగా కొనసాగింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పర్యటనలో మంత్రి కేటీఆర్ ఆత్మీయ పలుకరింపులు, హత్తుకొని ఆలింగనాలు, కరచాలనాలు చేసుకోవడం కనిపించింది. ఎక్కడికి వెళ్లినా అమ్మా, అవ్వ, తాతా, అన్న, తమ్ముడు అంటూ ప్రేమగా మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్లో నేత కార్మికులతో మమేకమై వివరాలు రాబట్టారు. దారం నుంచి పట్టు చీరె వరకు తయారయ్యే విధానాన్ని తెలుసుకున్నారు. ఇక మంత్రి కేటీఆర్ రాకతో పట్టణమంతా సందడిగా మారింది. ఉదయం భారీ వర్షం పడినా కేటీఆర్ కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన ప్రసంగం కోసం సభ ఆసాంతం ఎదురుచూశారు. కేటీఆర్ ప్రసంగంతో సభికుల్లో ఫుల్ జోష్ నెలకొంది.
పోచంపల్లి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలి
చేనేత కార్మికులకు దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామని, మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అర్హుడైన ప్రతి కార్మికుడికి నెలకు రూ.3వేలు బ్యాంక్ ఖాతాలో వేస్తామన్నారు. నేతన్న బీమా పథకంలో వయోపరిమితిని 59ఏండ్ల నుంచి 75 ఏండ్లకు పెంచుతున్నామని చెప్పారు. నేతన్నలకు హెల్త్ కార్డులను తీసుకొచ్చామని, రూ.25వేల వరకు సేవలు పొందవచ్చని అన్నారు. గుంట మగ్గాలకు బదులు ఫ్రేమ్ మగ్గాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులందరికీ కొత్తగా గుర్తింపు కార్డులు ఇస్తున్నామన్నారు. గతంలో నేత కార్మికులు చనిపోతే టెస్కో ద్వారా దహన సంస్కారాలకు రూ.5వేలు ఇచ్చేవారని, దాన్ని రూ.25 వేలకు పెంచామని పేర్కొన్నారు. పోచంపల్లి పట్టణం జిల్లాకే పరిమితం కాకూడదని, దీన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, జౌళి శాఖ రాష్ట్ర కమిషనర్ బుద్ధ ప్రకాశ్, కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, బీఆర్ఎస్ నేత కుంభం అనిల్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శేఖర్రెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి
‘ఎమ్మెల్యే శేఖర్రెడ్డి ఎల్లవేళలా అభివృద్ధి కాంక్షించే వ్యక్తి. ఇంకా అభివృద్ధి కోసం నిధులు కావాలని అడుగుతున్నారు. శేఖర్రెడ్డి ఏం అడిగినా తప్పకుండా చేస్తాం. మంచి నాయకులు, మంచి ప్రజాప్రతినిధులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మీ కోసం తపన పడే ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాపాడుకోవాలి. హ్యాండ్లూమ్ పార్కు గురించి శేఖర్రెడ్డి పట్టుబట్టారు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. శేఖర్రెడ్డిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి’ అని మంత్రి పిలుపునిచ్చారు.
శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 12 : పట్టు చీరెలకు ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లిలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కళా పునర్వి ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ను మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దారం నుంచి వస్త్రాల తయారీ వరకు చేనేత యూనిట్ ఏర్పాటు చేసిన సాయిని భరత్ను మంత్రి అభినందించారు. అనంతరం కనుముకుల గ్రామం పోచంపల్లి హ్యాండ్లూమ్ పారును సందర్శించారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహానికి గజమాల వేశారు. ట్రాక్టర్పై చేనేత మగ్గాన్ని ఏర్పాటు చేసి వస్త్రాన్ని తయారు చేస్తున్న చేనేత కళాకారుడు జి.నరసింహను ప్రశంసించారు. పోచంపల్లి నిధులు రూ.6.5 కోట్లతో సీసీ రోడ్లు, రెండు కోట్లతో సమీకృత వెజ్, నాన్ వెజ్ మారెట్.. రెండు కోట్ల రూపాయలతో ధోబీఘాట్, రూ.5.17 కోట్లతో అన్ని వార్డుల్లో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బాలాజీ గార్డెన్లో హ్యాండ్లూమ్ పార్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంత్రి పర్యటన సందర్భంగా బోనాలు, కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టెసో హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, రాష్ట్ర హ్యాండ్లూమ్ డైరెక్టర్ అలుగు వర్షిణి, అడిషనల్ డైరెక్టర్ పి.వెంకటేశం, జిల్లా ఏడీ విద్యాసాగర్, పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, పీఏసీఎస్ చైర్మన్లు కందాడి భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పాటి సుధాకర్రెడ్డి, సీత వెంకటేశం, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్
బీబీనగర్, ఆగస్టు 12 : చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది ముఖ్యమంత్రి కేసీఆరే. నేతన్న ఇంట్లో విద్యాబుద్ధులు నేర్చుకున్న సీఎం కేసీఆర్కు మరమగ్గం చప్పుడే కాదు.. నేతన్నల గుండె చప్పుడూ బాగా తెలుసు. ఉద్యమ కాలంలోనే పోచంపల్లి, సిరిసిల్లలో పర్యటించి చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకొని ఆదుకున్నారు. ఆదరణ, గుర్తింపు లేక నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. కలత చెందిన కేసీఆర్ నాడు జోలె పట్టి అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఆయన మద్దతుతో కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ, ఆ తరువాత వచ్చిన యూపీఏ ప్రభుత్వాలు చేనేత కార్మికుల గురించి పట్టించుకోలేదు.
నేత కార్మికులకు అండగా ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు అండగా ఉంటున్నది. పోచంపల్లి మండలంలోని కనుముక్కుల గ్రామంలో రూ.12.5 కోట్లు వెచ్చించి హాండ్లూమ్ పార్కును అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నది. నేతన్న కోసం చేనేత మిత్ర, త్రిఫ్ట్, నేతన్న బీమా వంటి అనేక పథకాలను తీసుకొచ్చింది. టీయూఎఫ్ఐడీ ద్వారా రూ.29 కోట్లు మంజూరు చేసి మున్సిపాలిటీ అభివృద్ధి పరుస్తున్నది. చేనేత రుణమాఫీ కోసం రూ.5.20 కోట్లు మంజూరు చేసింది. రెండో విడుత ఉచిత బీమాను ప్రారంభించి 2500 మందికి హెల్త్ కార్డులు అందజేసింది. ఎస్డీఎఫ్ నిధులతో నియోజకవర్గంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతున్నది.
మంత్రి కేటీఆర్ పర్యటన సైడ్ లైట్స్