యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన ఆలయం మహాద్భుతంగా నిర్మించారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శంశాక్ గోయల్ అన్నారు. మంగళవారం యాదాద్రి సన్నిధిలో బస చేసిన ఆయన బుధవారం ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనంతోపాటు,తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం పునఃప్రారంభానికి సిద్ధంగా ఉన్న యాదాద్రి ప్రధానాలయాన్ని తిలకించారు.
2020లో వచ్చానని స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చానని, నాటికీ,నేటికీ ఆలయ నిర్మాణంలో చాలామార్పులు వచ్చాయని,మహాద్భుతంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఆర్డీవో భూపాల్రెడ్డి, ఏఈవో గట్టు శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.