మిర్యాలగూడ/నల్లగొండ రూరల్, డిశంబర్ 3 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్ర్రెడ్డి అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా శనివారం మిర్యాలగూడ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద శ్రీకాంతాచారి చిత్రపటానికి ఎమ్మెల్యే భాస్కర్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, నాయకులు కరుణాకర్రెడ్డి, ఎండీ.షోయబ్, జావిద్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్రం గడియారం సెంటర్లోని శ్రీకాంతాచారి విగ్రహానికి తెలంగాణ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి హాజరై శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి ఆశయ సాధనకు తెలంగాణ ప్రభు త్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో గుంటోజు వెంకటాచారి, పోలోజు మదనాచారి, కొండయ్య, శ్రీరాములు, శ్రీనివాస్, వేణు, వినోద్చారి, నాయకులు పాల్గొన్నారు.
హాలియా : నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. హాలియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శ్రీకాంతాచారి ఫ్లెక్సీకి బీసీ యువజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్ళి రేపాకుల ఆంజనేయులు, హాలియా మున్సిపల్ కౌన్సిలర్ వర్రా వెంకట్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ యువజన, విద్యార్థి సంఘం నాయకులు మోర మధు యాదవ్, జోగు రమేశ్, పిల్లి వెంకటేశ్వర్లు, శ్రీనివాసాచారి, గణఫురం శంకర్, మేకల శివ, గీత, అంజలి, వెంకటాచారి పాల్గొ న్నారు. నార్కట్పల్లిలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో, మర్రిగూడలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి వర్ధంతి నిర్వహిచారు.
కట్టంగూర్: టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి నివాళులర్పించారు. నాయకులు పోగుల సాయికుమార్, భూపతి గణేశ్, గూడపూరి శేఖర్, బత్తిని సత్తయ్య, బొల్లెద్దు లింగయ్య, కాగింగు లింగస్వామి పాల్గొన్నారు.
విశ్వబ్రాహ్మణ మునుమయ యువజన సంఘం అధ్యక్షుడు పర్వతం అశోక్ ఆధ్వర్యంలో గొల్లగూడలోని పిచ్చమ్మ వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్లు, దుస్తులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షుడు చొల్లేటి రమేశ్, కాసోజు శంకరయ్య, గడుగోజు విజయ్, చిన్నోజు రాజు, మట్టోజు అర్జున్, నరసింహాచారి, వెంకటాచారి, సైదాచారి పాల్గొన్నారు.