నల్లగొండ సిటీ, ఫిబ్రవరి 20 : పాల్గుణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రాతఃకాలంలో పంచామృతాలతో అభిషేకం, అలంకరణ చేసి లక్ష్మి సహస్ర నామాలతో విశేషంగా కుంకుమ పూజ, సింహ హారతులు ఇచ్చి భక్తులకి దర్శనం కలిపించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని వడి బియ్యం, చీరలు సమర్పించారు. ఆలయ ముఖ్య అర్చకుడు నాగోజు మల్లాచారి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు, తీర్ధ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ అంబటి నాగిరెడ్డి పాల్గొన్నారు.