నీలగిరి, జనవరి 24 : పోక్సో, గ్రేవ్ కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ చందనాదీప్తి పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమావేశం నిర్వహించి పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్(అండర్ ఇన్వెస్టిగేషన్) కేసుల్లో గ్రేవ్, నాన్గ్రేవ్ కేసుల్లో నాణ్యమైన విచారణ చేయాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశోధన చేశాకే కేసు ఫైనల్ చేయాలని సూచించారు.
కేసులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిషరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ నాణ్యమైన, సత్వర సేవలు అందించాలన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని, విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, దొంగతనాలు జరుగకుండా పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు.
గంజాయి, జూదం, పీడీఎస్ బియ్యం రవాణాపై దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, రిపీటెడ్గా ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్బీ డీఎస్పీ సోమ్నారాయణ్ సింగ్, డీఎస్పీ విఠల్రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శ్రీధర్రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, డీసీఆర్బీ డీఎస్పీ సైదా, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.