నీలగిరి, డిసెంబర్ 21: ఈ నెల 30న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అపూర్వరావు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీసు అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరగా పరిషరించేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్నారు.
అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిషారానికి మరింత చొరవ చూపాలని తెలంగాణ రాష్ర్ట పోలీసు శాఖ చేపట్టిన 16 ఫంక్షనల్ వర్టికల్స్ రిసెప్షన్, క్రైమ్ వర్టికల్, టెక్ టీమ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, తదితర వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు.
జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగిన కేసుల్లో సత్వర న్యాయం జరుగుతుందని,కక్షి దారులకు అందరూ సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. సమావేశంలో నల్లగొండ, మిర్యాలగూడ డీఎస్పీలు శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి, డీ.సీఆర్బీ డీఎస్పీ సైదా నాయక్, సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు.