నల్లగొండ/నీలగిరి/నార్కట్పల్లి, మార్చి 15 : ప్రభుత్వం ద్వారా రూ. 250 కోట్లు మంజూరయ్యాయని, వచ్చే వర్షాకాలం నాటికి బ్రాహ్మ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ నుంచి బ్రాహ్మణ వెల్లెంల, బ్రాహ్మణ వెల్లెంల నుంచి చిట్యాల వరకు రూ. 67 కోట్లతో చేపట్టనున్న నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు శుక్రవారం ఆయన బ్రాహ్మణ వెల్లెంలలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి అయిన తర్వాత మొదటి సారిగా పుట్టిన ఊరు బ్రాహ్మణ వెల్లెంలకు రావడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో సొంత నిధులతో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని తెలిపారు. బ్రాహ్మణ వెల్లెంల గ్రామాన్ని సోలార్ మోడల్గా తీర్చిదిద్దుతానన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వ పనులు పునరుద్ధరించాలని, నార్కట్పల్లి డిపోను పునఃప్రారంభించాలన్నారు.
అంతకుముందు జిల్లా కేంద్రంలోని మాన్యంచెల్కలో రూ.1.43 కోట్లతో నూతనంగా నిర్మించనున్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి, ఎస్ఎల్బీసీలో రూ.11.20 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సాయంత్రం కలెక్టరేట్లో చెత్తను వేరు చేసే పద్ధతులు, చెత్త ద్వారా ఆదాయాన్ని సంపాదించే పద్ధతులపై సమావేశం జరుగగా మంత్రి హాజరై మాట్లాడారు. చెత్తను వేరు చేయటంతో చాలా లాభాలు ఉన్నాయని, మున్సిపల్ కార్మికులకు వేతనంతోపాటు, అదనపు ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉందని అన్నారు. కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ చెత్తను సేకరించడం, రీసైకిలింగ్ చేయడంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉందని, అకడ చెత్తను సేకరించడానికి ప్రతి ఇంట్లో నాలుగు చెత్త డబ్బాలు ఉంచుతారని, ఎకడికకడ గ్రేడింగ్ చేసి రీసైక్లింగ్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్డీఓ రవి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఐటీసీ ప్రతినిధి ఉమాకాంత్, ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్, డీఈ సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ ఉమేశ్, తాసీల్దార్ వెంకటరమణ, బత్తుల ఊషయ్య, దూదిమెట్ల సత్తయ్య, సట్టు సత్తయ్య, భరత్ పాల్గొన్నారు.