దామరచర్ల, మార్చి 25 : దామరచర్ల మండలం ఉపాధి హామీ పథకంలో 14వ విడత 2024-25 సంవత్సరానికి గాను రూ.5.56 కోట్లకు సంబంధించి మొత్తం 239 పనులకు గత 15 రోజులుగా అన్ని గ్రామ పంచాయతీలలో సోషల్ ఆడిట్ బృందం ఆడిట్ నిర్వహించడం జరిగింది. సోషల్ ఆడిట్ ప్రజా వేదిక బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలోని రైతు వేదికలో నిర్వహించడం జరిగింది. మొత్తం పనులలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లకు టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రెటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లపై రూ.20 వేల పెనాల్టీ, రూ.1,01,797 రికవరీని నిర్ధారించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వై.శేఖర్రెడ్డి, అంబుడ్స్ మెన్ ఎండీ గౌరీ, జిల్లా విజిలెన్స్ అసిస్టెంట్ మేనేజర్ పి.గౌతమి హాజరై ప్రిసైడింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ పత్యా నాయక్, ఎంపిడిఓ ఆర్.అలివేలు మంగమ్మ, క్లస్టర్ ఏపీడీ బాలకృష్ణ, ఎంపీఓ అశోక్, సూపరింటెండెంట్ మూర్తి, ఏపీఓ బి.నాగేశ్వరరావు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సర్పంచులు, సోషల్ ఆడిట్ బృందం సభ్యులు పాల్గొన్నారు.

దామరచర్లలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ