జిల్లాను ఆదివారం పొగ మంచు కమ్మేసింది. ఉదయం 9గంటలైనా మంచు తెరలు తొలగిపోలేదు. సూర్యుడి జాడ కనిపించలేదు.
దీంతో ఉదయం పనులకు వెళ్లే రైతులు, కూలీలు, కూరగాయల విక్రయదారులు అవస్థలు పడ్డారు. హైవేలపై లైట్లు వేసుకున్నా ముందున్న వాహనాలు కనపించక పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.