ఎక్కడైనా ఉప ఎన్నిక వస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల, శాసనసభ్యుడు మరణిస్తే, రెండు సభలకు ఎన్నికైన సమయంలో ఒక సభకు రాజీనామా చేయడంతో వస్తుంది. కానీ.. మునుగోడులో అందుకు భిన్నంగా జరిగిందని.. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం కొత్త మండలంగా ఏర్పాటైన గట్టుప్పల్లో తాసీల్దార్, పోలీస్ స్టేషన్ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞత సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి మోకాలడ్డుతున్న బీజేపీలో చేరిన రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించాలన్నారు.
అమిత్షాను మునుగోడుకు తీసుకొచ్చిన రాజగోపాల్రెడ్డి నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. రైతుల నడ్డి విరిచేందుకే మోటర్లకు మీటర్లు పెడుతున్నారని మండిపడ్డారు. మండలాల వ్యవస్థ ప్రారంభం నుంచి గట్టుప్పల్ మండల ఏర్పాటు డిమాండ్ ఉన్నదని, విలీన గ్రామాల్లో ఐక్యత లేకనే మండలం ఏర్పాటు ఆలస్యం అయ్యిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్రామాల సమ్మతితో నేడు మండలం ఏర్పాటైందని చెప్పారు. రానున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని కోరారు.
చండూరు, అక్టోబర్ 2 : యావత్ భారత దేశం తెలంగాణ వైపు చూస్తోందని, వివిధ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు తమకూ కావాలని కోరుకుంటున్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం గట్టుపల్ మండలంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎక్కడైనా ఉప ఎన్నిక కొన్ని అనివార్య కారణాల వల్లనో, లేదా అక్కడి ఎమ్మెల్యే మృతి చెందితే, అతడికి రెండు పదవులు ఉండి ఒక దానికి రాజీనామా చేస్తే వస్తుందని, కానీ మునుగోడులో అందుకు భిన్నంగా ఒక వ్యక్తి తన స్వలాభం కోసం, రూ. 22 వేల కోట్ల కాంట్రాక్టు కోసం 2.22 లక్షల మంది ఓటర్ల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి.. తెలంగాణ అభివృద్ధికి ఆటంకిగా మారిన బీజేపీకి అమ్ముడు పోవడం వల్లనే వచ్చిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మోకాలడ్డుతున్న బీజేపీకి కోవర్ట్గా మారిన రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు చిత్తుగా ఓడించాలన్నారు.
అమిత్షాను మునుగోడుకు తీసుకువచ్చిన రాజగోపాల్రెడ్డి నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకువచ్చారని మంత్రి ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్తు, వృద్ధులకు రూ. 2వేలు, వికలాంగులకు రూ.3 వేల పింఛన్, రైతుబంధు, రైతుబీమా , కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలు చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు. రైతుల నడ్డి విరిచేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేడు మోటర్లకు మీటర్లు పెడుతున్నారన్నారు. మండలాల వ్యవస్థ ప్రారంభం నుండే గట్టుప్పల మండలం ఏర్పాటు డిమాండ్ ఉండేదని, విలీన గ్రామాల్లో ఐక్యత లేకనే ఆలస్యం అయ్యిందన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్రామాల సమ్మతితో నేడు మండలం ఏర్పాటైందని పేర్కొన్నారు.
దశాబ్దాల పాటు మునుగోడు నియోజకవర్గం ప్రజలు ఫ్లోరోసిస్తో పోరాటం చేస్తుంటే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ కృష్ణా జలాలు అందించి ఫోరోసిస్ రక్కసిని తరిమి కొట్టారన్నారు. నేడు ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యసంస్థ ప్రకటించిందన్నారు. మండలాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు ప్రజలంతా రానున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి కానుకగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పరిషత్ వైస్చైర్మన్ గోపగాని వెంకట్నారాయణ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం మాధవీ వెంకట్రెడ్డి, జడ్పీటీసీలు పాశం సురేందర్రెడ్డి, నారబోయిన స్వరూపారాణి, గ్రామశాఖ అధ్యక్షుడు బండారు చంద్రయ్య, సర్పంచులు ఇడెం రోజా, వీరమళ్ల శ్రీశైలం, నల్ల లింగయ్య, ఎంపీటీసీలు అవ్వారు గీతాశ్రీనివాస్, చెరుపల్లి భాస్కర్, గొరిగె సత్తయ్య, నాయకులు ఇడెం కైలాసం, కర్నాటి అశోక్, బుడిగె వెంకటేశ్, భీమగాని మహేశ్గౌడ్, వెంటేశ్గౌడ్, ఇడెం గణేశ్, తాటి భాస్కర్, అన్నెపర్తి శేఖర్, కర్నాటి రామలింగం పాల్గొన్నారు.
రాజగోపాల్రెడ్డి అబద్ధాల కోరు
ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
అభివృద్ధి చేయలేక మునుగోడు ప్రజలకు మాయ మాటలు చెప్పి రూ. 22 వేల కోట్లకు బీజేపీకి అమ్ముడు పోయి.. అభివృద్ధికోసమే తాను రాజీనామా చేశానంటూ చెబుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అబద్ధాలకోరు. మునుగోడు ప్రజలను మోసం చేసి నేడు ఉప ఎన్నికకు కారణమయ్యాడు. గట్టుప్పల మండల ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమైంది. అన్ని కార్యాలయాలు త్వరలో ఏర్పాటు కానున్నాయి. అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలంతా అండగా ఉండాలి.