కోదాడ, మే 25 : జూన్ నెలలో హైదరాబాద్, మిర్యాలగూడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్- 19 జూనియర్, సీనియర్ (బాల బాలికలు) బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికకు ఈ నెల 31న కోదాడ ఇఆర్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రంగారావు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఎంట్రీలను నమోదు చేసుకుని పోటీల్లో పాల్గొనాల్సిందిగా కోరారు. తమ ఆధార్ కార్డు, జిల్లా పరిధిలోని కళాశాలలో చదివినట్టుగా స్టడీ సర్టిఫికెట్ పొంది ఉండాలన్నారు. వివరాలకు 905906863, 9642114372 నంబర్లను సంప్రదించాలని సూచించారు.