చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 5 : అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, వాటికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీ(టీ)ఆర్ఎస్లో చేరుతున్నారని పార్టీ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్గౌడ్ అన్నారు. మండలంలోని దండుమల్కాపురం వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆయన సమక్షంలో బీ(టీ)ఆర్ఎస్లో బుధవారం చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు బీ(టీ)ఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్గౌడ్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అర్హులకు పథకాలు అందని యెడల కార్యకర్తలు దగ్గరుండి అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాస్రావు, గ్రామశాఖ అధ్యక్షుడు ఈడ్డుల మస్తాన్బాబు యాదవ్, ఉపసర్పంచ్ మల్కాజిగిరి కృష్ణ పాల్గొన్నారు.
బీజేపీ నుంచి బీ(టీ)ఆర్ఎస్లో పలువురి చేరిక
చండూరు : చండూరు మున్సిపాలిటీలోని 10వ వార్డుకు చెందిన బీజేపీ నుంచి పలువురు మాజీ ఎంపీపీ తోకల వెంకన్న సమక్షంలో బుధవారం బీ(టీ)ఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో సంకోజు మహేశ్తో పాటు మరో 10మంది ఉన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కోడి వెంకన్న, పట్టణాధ్యక్షుడు బూతరాజు దశరథ, కొన్రెడ్డి యాదయ్య, మోగుదాల వెంకన్న, పున్న ధర్మేందర్, తేలుకుంట్ల చంద్రశేఖర్, పున్న సైదులు, సంగెపు సువర్ణ, బూతరాజు వెంకన్న పాల్గొన్నారు.