నల్లగొండ, ఫిబ్రవరి 14 : తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క, సారలమ్మ దేవతల ప్రసాదాలను మీసేవ కేంద్రాల ద్వారా అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచామని మీసేవ కేంద్రాల జిల్లా మేనేజర్ గులాం గఫార్ అహ్మద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
భక్తుల సౌకర్యర్థం మీ సేవ పౌర సేవల్లో శ్రీ సమ్మక్క, సారలమ్మ జాతర ప్రసాద సేవను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ప్రసాదం కావాల్సిన భక్తులు రూ. 225 మీసేవ కేంద్రాల్లో చెల్లించి ప్రసాదాన్ని ఆర్డర్ చేసినట్లయితే
కొరియర్ ద్వారా ప్రసాదం నేరుగా దరఖాస్తుదారుడి చిరునామాకు చేరుతుందన్నారు. భక్తులు చెల్లించే రూ. 225లో ప్రసాదం ధర రూ. 190కాగా, సేవా రుసుము కింద రూ. 35 రూపాయలు తీసుకోకుంటామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గఫార్ అహ్మద్ కోరారు.