దేవరకొండ, ఏప్రిల్ 13 : అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. దేవరకొండ పట్టణంలో గురువారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ నుంచి సమావేశ ఫంక్షన్ హాల్ వరకు మూడు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ జెండాను ఎంపీ బడుగులతో కలిసి ఎమ్మెల్యే ఆవ్కిరించారు. సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలకు చేసిందేమీ లేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. రైతులకు ఎకరానికి రెండు విడుతలుగా పెట్టుబడి సాయం రూ.10వేలు అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అందించే సంక్షేమ పథకాలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తేనే పేదలు ఆర్థికంగా ఎదుగుతారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ సభ్యత్వాలు 60 లక్షలకు చేరాయని, పార్టీకి వస్తున్న ఆదరణ చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతుందని తెలిపారు. తెలంగాణలో సంక్షేమ పథకాలను ఎలా అందిస్తున్నారని పార్లమెంట్లో ఇతర రాష్ర్టాల ఎంపీలు అడుగుతున్నారన్నారు. దేశంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలకు రావాలని మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు మరిన్ని రాష్ట్రాలు కోరుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రూ.65లక్షల కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. దేవరకొండ నియోజకవర్గానికి 5లిఫ్టుల నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రజా సేవకుడని, నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు విన్నవించి పరిష్కరించేందుకు తీవ్ర కృషి చేస్తుంటారని తెలిపారు. రవీంద్రకుమార్ను రాబోయే ఎన్నికల్లో 50వేల మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
నియోజకవర్గంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే 1.60లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ పట్టణంలో రూ.25 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.5 కోట్లతో ఖిల్లాలో పార్కు పనులు చివరి దశకు వచ్చినట్లు తెలిపారు. డిండి లిఫ్ట్ పథకంతోపాటు రూ.3600 కోట్లతో నియోజకవర్గంలో 5 రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే మూడింటి పనులు 90శాతం పూర్తయ్యాయని చెప్పారు. మండంలో 39 గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులు, రహదారులు, అంతర్గత రోడ్లు చేపట్టినట్లు తెలిపారు. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ సమీపంలో లిఫ్ట్ పథకం పూర్తయి సుమారు 8వేల ఎకరాలకు సాగనీరు అందుతుందని చెప్పారు.
మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. గిరిజనులకు దామాషా ప్రకారం 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్చిపోలేమన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు చేసి డిండి ప్రాజెక్టు ద్వారా నింపుతున్నామని తెలిపారు. తెలంగాణలో అందిస్తున్న పథకాలు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు చేయడం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందన్నారు. ఎస్టీలకు దళిత బంధు పథకం ద్వారా రూ.10లక్షలు, యాదవులకు గొర్రెలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్రెడ్డి, వైస్ చైర్మన్ రహత్అలీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, నాయిని సుధీర్రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, ఎమ్మెల్యే కుమారు డు హిమవంత్కుమార్, సర్ఫంచుల ఫోరం మండలాధ్యక్షుడు నేనావత్ శ్రీనునాయక్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు నర్సింహ, నాయకులు మారుపాకుల సురేశ్గౌడ్, బొడ్డుపల్లి కృష్ణ, జయప్రకాశ్ నా రాయణ, అంజిగౌడ్, భూదేవీ సైదులు, మహ్మద్ రైస్, తౌఫిక్, ఇలియాస్, గోపాల్, సైదులు, మధు, లక్ష్మణ్, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.