మునుగోడు, ఏప్రిల్ 09 : నమ్ముకున్న ఆశయం కోసం తుది వరకు పోరాడిన యోధుడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి అని సీపీఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు. బుధవారం నర్రా రాఘవరెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తరిమికొట్టేందుకు నర్రా రాఘవరెడ్డిని ఆదర్శంగా తీసుకుని పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు, యాసరాణి శ్రీను, వేముల లింగస్వామి, యాట యాదయ్య, నరేశ్ పాల్గొన్నారు.