బీసీ సంక్షేమాధికారి యాదయ్య
మోత్కూరు, జూన్ 4 : ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి సాధిస్తాయని జిల్లా సంక్షేమాధికారి,మండల ప్రత్యేకాధికారి యాదయ్య అన్నారు. మండలంలోని రాగిబావి, పనకబండ, ముశిపట్ల, సదర్శాపురం, పాటిమట్ల గ్రామాల్లో శనివారం ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఆయా గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్రెడ్డి, ఎంపీఓ రాహుఫ్ ఆలీ, సర్పంచులు రాంపాక నాగయ్య, తిరుమలేశ్, విజయానర్సిరెడ్డి, కవితాశ్రీనివాస్ పాల్గొన్నారు.
భువనగిరి మండలంలో…
భువనగిరి అర్బన్ : మండల వ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం రెండో రోజూ కొనసాగింది. శనివారం మండలంలోని పచ్చర్లబోడు తండా, ఆకుతోటబావితండా, సూరెపల్లితండా, రెడ్డినాయక్ తండాల్లో పల్లెప్రగతి పనులను డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్రావు పరిశీలించారు. పచ్చర్లబోడుతండాలో ఇంటింటికీ చెత్త బుట్టలను పంపిణీ చేశారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులను సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గుత్తా నరేందర్రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.
బీబీనగర్లో…
ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సర్పంచ్ భాగ్యలక్ష్మీశ్రీనివాస్ పేర్కొన్నారు. 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం బీబీనగర్లో ఇంటింటికీ తిరిగి ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను వివరించారు. ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని తెలిపారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకునేవారికి ప్రభుత్వం నగదు అందజేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రవీణ్, వేణు, యమున, నాయకుడు నరేందర్, కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి
అడ్డగూడూరు : ప్రజలు గ్రామాలను అభివృద్ది చేసుకోవాలని ఎంపీడీఓ చంద్రమౌళి పిలుపుని చ్చారు. మండలంలోని అజీంపేట గ్రామంలో ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ డీఓ చంద్రమౌళి, సర్పంచ్ ప్రవళ్లిక, ఎంపీటీసీ బట్టు చిన్న వెంకటయ్య, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి
రామన్నపేట : పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని రామన్నపేట సర్పంచ్ గోదాసు శిరీషాపృథ్వీరాజ్ అన్నారు. 5వ విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని ఎస్సీ కాలనీల్లో పర్యటించి ప్రజలను సమస్యలడిగి తెలుసుకున్నారు. ఇంకుడుగుంతల నిర్మాణం, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీఓ రాజు, ప్రత్యేకాధికారి వెంకటేశం, కార్యదర్శి సంజీవరెడ్డి, వార్డుసభ్యులు సుస్మితాశేఖర్, సునీతాశ్రీనివాస్ పాల్గొన్నారు.