కట్టంగూర్, డిసెంబర్ 1 : తాళం వేసిఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకుంటూ బుధవారం రాత్రి మండలంలోని అయిటిపాములలో దొంగలు రెచ్చిపోయారు. ఒకేరోజు మూడిండ్లలో చోరీలకు పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పబ్బు వెంకన్న, విశ్రాంత ఉపాధ్యాయుడు లక్ష్మారెడ్డి తమ ఇండ్లకు తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇండ్లకు వెళ్లారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇండ్లకున్న తాళాలు విరగొట్టి లోనికి ప్రవేశించారు.
బెడ్రూంలోని బీరువాల్లో ఉన్న బంగారం, వెండినగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. పబ్బు వెంకన్న ఇంట్లో రూ.10వేల నగదు, అరతులం బంగారం, లక్ష్మారెడ్డి ఇంట్లో రూ.10వేల నగదు, బంగారు ఉంగరం చోరీ చేశారు. అదే విధంగా గ్రామానికి చెందిన బెల్లి సుధాకర్ ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.