పెద్దఅడిశర్లపల్లి, జూలై 17 : సమైక్య పాలనలో నిర్వీర్యమైన విద్యావ్యస్థను బలోపేతం చేయడంతో పాటు దానిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. పీఏపల్లి జడ్పీఉన్నత పాఠశాలలో మన ఊరు.. మన బడి ద్వారా రూ. 1.20 లక్షలతో చేపడుతున్న అదనపు తరగతుల నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు.. మన బడి ద్వారా అన్ని పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తున్నదన్నారు.
రాష్ట్ర వ్యాప్తం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుందన్నారు. విద్యార్థుల తల్లితండ్రులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. అంతకు ముందు గుడిపల్లిలో కోటి నలభై లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక, జడ్పీఉన్నత పాఠశాల భవనాల నిర్మాణాలకు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత, గుడిపల్లి, పీఏపల్లి సర్పంచులు శీలం శేఖర్రెడ్డి, గొర్ల సైదమ్మాశ్రీనివాస్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మునగాల అంజిరెడ్డి, ఎంఈఓ రాము, నాయకులు తోటకూరి పరమేశ్, పాల్వాయి రంగారెడ్డి, యాదగిరి, బొడ్డుపల్లి మహేందర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో పలువురి చేరిక
పెద్దఅడిశర్లపల్లి మండలంలోని గుడిపల్లి గ్రామానికి చెందిన పలువురు యువకులు వివిధ పార్టీలకు రాజీనామా చేసి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ చేరవేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో మర్రి కృష్ణయ్య, ఎర్ర కోటేశ్, ముర్ర హరీశ్, నిమ్మల వెంకటేశ్, బోడ పప్పు ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత, సర్పంచ్ శీలం శేఖర్రెడ్డి, బోయ సుధాకర్రెడ్డి, ఎర్ర యాదగిరి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ కృషితోనే ఏటా మూడు పంటలు
ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
సమైక్య రాష్ట్రంలో సరిగా విద్యుత్ అందక పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలయ్యారని, తెలంగాణ ఏర్పాటయ్యాక వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించి రైతులు మూడు పంటలు సాగు చేసుకునేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని కొల్ముంతల్ పహాడ్ క్లస్టర్ పరిధిలోని రైతువేదికలో జరిగిన రైతుల సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతుల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారన్నారు.
గత పాలకులు రాత్రి వేళల్లో విద్యుత్ ఇవ్వడంతో రైతులు పొలాల వద్ద విషపురుగుల బారిన పడి మరణించారన్నారు. ప్రస్తుతం నిరంతర విద్యుత్తో ఆ సమస్య తీరిందన్నారు. పాత రోజులను మళ్లీ గుర్తు చేస్తూ సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం తిరిగి పదేండ్లు వెనక్కి పోతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతు పలికి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీ సలహాదారుడు పస్నూరి యుగేంధర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నేనావత్ రాంబాబు నాయక్, లాలూనాయక్, శ్రీను నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.