రేషన్ డీలర్ల కమీషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండింతలు పెంచడంతోపాటు ఉచితంగా హెల్త్ కార్డు ఇస్తామని ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లు సంబురాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకాలు చేశారు. నకిరేకల్లో నియోజకవర్గ స్థాయి రేషన్ డీలర్లు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ సభను ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి రేషన్ డీలర్లు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అన్ని మండల కేంద్రాల్లో రేషన్ డీలర్ల సంఘాల ఆధ్వర్యంలో సంబురాలు
జరిగాయి.
బొడ్రాయిబజార్, ఆగస్టు 9 : ప్రతి నెలా మొదటి వారంలో ప్రజలకు రేషన్ సరుకులు ఇస్తూ అందరి కడుపు నింపుతున్న రేషన్ డీలర్ల కడుపును ముఖ్యమంత్రి కేసీఆర్ నింపారని సూర్యాపేట రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు చక్రహరి నాగరాజు అన్నారు. రేషన్ డీలర్ల కమీషన్ రూ.70 నుంచి 140కి పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్రెడ్డి, గంగుల కమలాకర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని కలిసి ఆందోళనలు చేస్తామని చెప్పగా, ఎలాంటి ఆందోళనలు వద్దని, సీఎం కేసీఆర్ మీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పినట్లు తెలిపారు. రేషన్ డీలర్ల కుటుంబాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులకు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో రేషన్ డీలర్లు మొహినొద్దీన్, నాగయ్య, వీరేందర్, కృష్ణ, ఖాజా, అన్నెపర్తి పద్మ, శైలజ, ముంతాజ్, సుజాత, కృష్ణ పాల్గొన్నారు.
అర్వపల్లి, గరిడేపల్లి, నాగారంలో..
అర్వపల్లి/గరిడేపల్లి/నాగారం, ఆగస్టు 9 : రేషన్ డీలర్ల కుటుంబానికి ఆరోగ్య బీమా సౌకర్యంపై హర్షం వ్యక్తం చేస్తూ జాజిరెడ్డిగూడెం మండల రేషన్ డీలర్లు అర్వపల్లిలో, గరిడేపల్లి, నాగారం మండల డీలర్లు ఆయా మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఆయా కార్యక్రమాల్లో దండ అరుణాభద్రారెడ్డి, ఏలె ఉమాదేవి, చెరుకు శ్రీలత, చెంచల నిర్మల, మామిడి అంజమ్మ, బాసాని అశోక్, పాల్వాయి పరమేశ్, గాదె వెంకటేశ్వర్లు, రవీందర్ సుభద్ర, చంద్రకళ, శ్రీనివాస్, గురువయ్య, తిరుపతమ్మ, నాగమణి, కిరణ్కుమార్, సైదులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కాట zయ్య, పాశం మధుసూదన్రెడ్డి, ఎర్ర పుష్పాంజలి, వినీత, యాకలక్ష్మి, సూర య్య, ఉప్పలయ్య, లింగ య్య, సత్యనారాయణ పాల్గొన్నారు.