రామన్నపేట: గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని 116 మంది గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం సరఫరా చేసిన నూతన వస్ర్తాలను ఆయన అందజేశారు.
పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నెలకు రూ.8,500 అందిస్తుందన్నారు. కరోనా సమ యంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి పోతాయన్నారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పరిచేందుకు నెలలో ఒకసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు.
ఈడెం ట్రస్ట్ సేవలు అభినందనీయం
మండలంలోని వెల్లంకి గ్రామంలో ఈడెం స్వరూప మెమోరియల్ ట్రస్టు చైర్మన్ ఈడెం శ్రీనివాస్ గ్రామపంచాయతీ సిబ్బందికి సమకూర్చిన దుస్తు లను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు. ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. అలాగే వెల్లంకి గ్రామ సర్పంచ్ ఎడ్ల మహేందర్రెడ్డి గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి ఒక్కరికి రెండువేల రూపాయలను దసరా కానుకగా అందజేశారు.
సీఎం సహాయనిధి పేదప్రజలకు వరం..
సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాల యంలో రామన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన నలుగురికి లక్ష యాభై తొమ్మిదివేల రూపాయలను అందజేశారు.