రామన్నపేట: ప్రతి ఒక్కరికి కేసీఆర్ సంక్షేమ పథకాలు ఆసరాగా నిలుస్తున్నాయని రాబోయే కాలంలో కేసీఆర్కు అండగా నిలబడాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. శనివారం రామన్నపేట కొమ్మాయిగూడెం, కొత్తగూడెం, శోభనాధ్రిపురం గ్రామాల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్హాలులో 75 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 52 మందికి సీఎం సహాయనిధి చెక్కులను, ఎల్వోసీలను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు అధైర్య పడవద్దని ప్రస్తుత వానాకాలం సీజన్కు సంబంధించిన ధాన్యంను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధిలో ముందున్నాయని అన్నారు.
శోభనాధ్రిపురం గ్రామంలో వంతెనల పూర్తికి హామీ ఇచ్చారు. కొమ్మాయిగూడెం గ్రామంలో సీసీరోడ్డు, డ్రైన్, అంగన్వాడీ కేంద్రం, కొత్తగూడెంలో సీసీ రోడ్లు, లకా్ష్మపురం గ్రామంలో గౌడ సంఘం భవనం పూర్తికి నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. కొమ్మాయిగూడెం గ్రామంలో టీఆర్ఎస్పార్టీ జెండాను ఎగురవేశారు.
కార్యక్రమంలో నార్మాక్స్ చైర్మెన్ గంగుల కృష్ణారెడ్డి, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్ మోహన్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, తహాసీల్దార్ ఆంజనేయులు, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, ప్రజా ప్రతి నిధులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.