రామన్నపేట: చేనేత కుంటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతనిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మండ లంలోని వెల్లంకి, సిరిపురం గ్రామల్లో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న ఆరు గురు బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అసెంబ్లీలో జియో ట్యాగింగ్, చేనేత కార్మికుల సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
ప్రత్యేకపూజలు..
రామన్నపేట మండల కేంద్రంలోని దుర్గా మాత మండపం వద్ద ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఆదర్శ యూత్ స భ్యులు నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సిరిపురం దుర్గా మాత మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, జడ్పీటీసీ పున్న లక్ష్మి, సింగిల్విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మండలా ధ్యక్షుడు ఉదయ్రెడ్డి, సర్పం చ్లు ఎడ్ల మహేందర్రెడ్డి, అప్పం లక్ష్మినర్సు, పట్టణాధ్యక్షుడు పోతరాజు సాయికుమార్, నీల దయాకర్, గోదాసు పృథ్వీరాజ్, మందడి శ్రీధర్రెడ్డి, సాల్వేరు లింగం తదితరులు పాల్గొన్నారు.