కేతేపల్లి, అక్టోబర్ 30 : సీఎం కేసీఆర్ పాలనలో సంక్షే మ పథకాలకు స్వర్ణయుగమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ తెలిపారు. మండలంలోని గుడివాడ, కాసనగోడు, బొప్పారం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయని అభివృద్ధిని తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆసరా పెన్షన్లతో నిరుపేదలకు అండగా నిలిచారన్నారు.
కల్యాణలక్ష్మితో ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సాయం అందజేసారని పేర్కొన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా రూపొందించారన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే కనపడే కాంగ్రెస్ నాయకులు ఏండ్ల తరబడి అభివృద్ధిని గాలికి వదిలారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మళ్లీ కరెంటు కష్టాలు తప్పవని పేర్కొన్నారు. మరోసారి కారుగుర్తుకు ఓటు వేసి చిరుమర్తి లింగయ్యకు భారీ మెజార్టీని తీసుకురావాలని ఆయన కోరారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయా గ్రామాల్లో కాలినడకన తిరుగుతూ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కారుగుర్తుకు ఓటువేయమని ఓటర్లను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని చేపట్టడం జరిగిందన్నారు. ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై భారీ ర్యాలీగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్, పార్టీ మండలాధ్యక్షుడు మారం వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, జడ్పీటీసీ బొప్పని స్వర్ణలతాసురేశ్, మాజీ ఎంపీపీ బడుగుల శ్రీనివాస్యాదవ్, సర్పంచులు కట్ట శ్రవణ్కుమార్, చల్ల పూలమ్మాకృష్ణారెడ్డి, కర్ర ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
నకిరేకల్ : కాంగ్రెస్ను నమ్మితే తెలంగాణ కథ మొదటికొస్తదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దుయ్యబట్టారు. నకిరేకల్ మండలంలోని వల్లభాపురం, నడిగూడెం, ఓగోడు గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన రోడ్డు షోలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరిస్తూ బీఆర్ఎస్ను మరోసారి ఆదరించాలని కోరారు. ఎన్నికల్లో చెప్పింది చెప్పినట్లు చేసే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రౌడీయిజం, అరాచకాలు, పోలీస్ స్టేషన్లలో పంచాయితీలు తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు.
కారు గుర్తుకు ఓటు వేసి మరో సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమాలలో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్, వైస్ ఎంపీపీ గొర్ల సరితావీరయ్య, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల సోమన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, నడిగూడెం, ఓగోడు సర్పంచులు మాద నాగరాజు, అబ్బగోని విజయలక్ష్మీశ్రీనివాస్, నాయకులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సోమ యాదగిరి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ప్రసాద్, వెంకన్న, సైదులు, పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నుంచి
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలోని 1,2,3 వార్డుల్లో 100 మంది యువకులు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు రాజీనామా చేసి ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎంపీ, ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఏర్పుల హరికృష్ణ, బీజేవైఎం అసెంబ్లీ కో కన్వీనర్ కోపల్లి భిక్షంరెడ్డి, జాల వెంకన్న, బీజేపీ ఓబీసీ టౌన్ కన్వీనర్ ఏశబోయిన పాండు, ఏశబోయిన సైదులు, ఎఫ్సీఐ గోదాం కార్మిక నాయకులు జాల ప్రవీణ్, జాల జైపాల్, భూపతి సాయి, వినయ్, ఏశబోయిన లింగస్వామి, దుర్గం బన్నీ, జక్కల గణేశ్, ఏర్పుల దిలీప్కుమార్, తండు రమేశ్, దేవులపల్లి వెంకన్న, మేడిపల్లి సాయి, ఎస్కే ఫయాజ్, జహంగీర్, పొట్టబత్తుల సాయి, పవన్కళ్యాణ్, దైద రామకృష్ణ, వీరేందర్రెడ్డి, చిట్టిపోలు శ్రీకాంత్, వనం నరేశ్, రాపోలు ప్రకా శ్, వజ్జ వీరయ్య, హరీశ్ ఉన్నారు.
రామన్నపేట : మండలంలోని నీర్నెంముల, లక్ష్మాపురం గ్రామానికి చెందిన 80 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నార్కట్పల్లి క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో తర్పూనూరి సత్తయ్య, గంగయ్య, శివ, మత్స్యగిరి, ఉదయ్, బద్దం మత్స్యగిరి, కొమ్ము నవీన్, సుర్వి యాదయ్య, శంకరయ్య, వెంకటయ్య, స్వామి, మల్లయ్య, కాటం, నవీన్, రాములు, భిక్షం, కిష్టయ్య, మహేశ్, నరేశ్, మత్స్యగిరి, మధు, తమాస్, లక్ష్మయ్య ఉన్నారు. ఈకార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి పోశబోయిన మల్లేశం,సర్పంచ్ ఉప్పు ప్రకాష్, మాజీ సర్పంచ్ బత్తుల శంకరయ్య, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమారమేశ్, ఉపసర్పంచ్ మహేశ్, పులిపలకుల వీరస్వామి, బత్తుల వెంకటేశం, జోగుల సత్యనారాయణ, మారోజు అనంతచారి, నీలానర్సింహ, బద్దం గోపాల్, చిత్ర కంటి స్వామి, నాగరాజు, మత్స్యగిరి, కొమ్ము నర్సింహ పాల్గొన్నారు.