మోత్కూరులో అత్యధికంగా 85.6 మిల్లీ మీటర్లు
రోజంతా మబ్బులు.. చినుకులు
నల్లగొండ, జూన్ 27: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా పడగా మరికొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. నకిరేకల్ మండలంలో అత్యధికంగా 36.22 మిల్లీ మీటర్ల వర్షం పడగా కట్టంగూర్లో 34.3, శాలిగౌరారంలో 32.7, మునుగోడు 19.4, నల్లగొండ 18.7, నార్కట్పల్లి 18.1, తిప్పర్తి 17.6, కేతేపల్లి 15.6, చిట్యాల 15.1, మాడ్గులపల్లి 14.0, మర్రిగూడ 13.3, చండూరు 9.9, వేములపల్లి 8.5, చింతపల్లి 8.0, అడవిదేవుల పల్లి 7.8, దామరచర్ల 6.3, కనగల్ 5.9, మిర్యాలగూడ 5.9, నాంపల్లి 5.2, అనుముల 4.3, గుర్రంపోడు 4.0, త్రిపురారం 2.8, పీఏ పల్లి 2.4, నిడమనూరు 1.7, కొండమల్లేపల్లిలో 1.5 మి.మీ వర్షం పడింది. అత్యల్పంగా పెద్దవూర మండలంలో 0.8 మి.మీ వర్షం పడింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 81.7 మి.మీ పడాల్సి ఉండగా 75.5 మి.మీ మాత్రమే కురిసి 8 శాతం లోటుగా నమోదైంది.
సూర్యాపేట జిల్లాలో..
జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 18. 5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నాగారం మండలంలో 53.2 మి.మీ పడగా నూతనకల్లో 43.0 మి.మీ, ఆత్మకూర్(ఎస్) 40.0, జాజిరెడ్డిగూడెం 37.4, తిరుమలగిరి 29.6, తుంగతుర్తి, సూర్యాపేట 28.6, మోతె 17.7, మద్దిరాల 16.9, అనంతగిరి, చింతలపాలెం 15.6, కోదాడ 13.6, మెళ్లచెర్వు 12.7, నడిగూడెం, మునగాల, మఠంపల్లి, చిలుకూరు, హుజూర్నగర్ మండలాల్లో 10 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. పాలకవీడు, పెన్పహాడ్, చివ్వెంల, గరిడేపల్లి, నేరేడుచర్ల మండలాల్లో 10 మిల్లీ మీటర్ల లోపు వర్షపాతం నమోదైంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి జిల్లా మోత్కూరులో అత్యధికంగా 85.6మిల్లీ మీటర్లు, గుండాలలో 36.6, వలిగొండలో 34.2, ఆత్మకూరు(ఎం)లో 30.4, భువనగిరిలో 25.6, భూదాన్పోచంపల్లిలో 25.6, ఆలేరులో 18.6, సంస్థాన్నారాయణపురంలో 18.2, యాదగిరిగుట్టలో 17.8 మి.మీల వర్షం కురిసింది.