రామగిరి, ఏప్రిల్ 02 : ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఉచితంగా నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య అందుతుందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యంత ఆధునికమైన లాబరేటరీలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోకి స్వాగతిస్తున్నాయని పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేట ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద కరపత్రాలతో విస్తృత ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఆ కళాశాల అధ్యాపకులు మాల వెంకట్ రెడ్డి, ఉపేందర్ రావు నిర్మల తోపాటు పలువురు అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో ఉన్న వసతులపై పదో తరగతి పరీక్ష కేంద్రం చిట్యాల వద్ద ప్రచారం చేసి అవగాహన కల్పించారు. జూనియర్ కళాశాలలో చేరడం వల్ల ఎలాంటి ఫీజులు ఉండవని, ఈ విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనం, టిఫిన్ సైతం ప్రభుత్వ అందిస్తుందని తెలిపారు. అందుకే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి తమ ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని కోరారు. వారి వెంట అధ్యాపకులు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కవిత, కిరణ్ పాల్గొన్నారు.