మిర్యాలగూడ, ఫిబ్రవరి 16 : మహిళ మెడలో గొలుసు అపహరించుక పోతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గురువారం జరిగింది. పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం శాంతినగర్కు చెందిన మేకల నీలమ్మ వర్డ్ అండ్ డీడ్ పాఠశాల సమీపంలో తన ఇంటి నుంచి సమీపంలోనే ఉన్న కుమార్తె ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నది.
ఈ క్రమంలో హైదరాబాద్ మొఘల్పురాకు చెందిన ఇర్ఫాన్అలీ నీలమ్మ మెడలో ఉన్న 4 తులాల బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు. నీలమ్మ వెంటనే దొంగ దొంగ అని అరవడంతో స్థానికులు దొంగను వెంబడించి పట్టుకుని దేహశుద్ధ్ది చేశారు. గొలుసును మహిళకు అప్పగించారు. కాగా నిందితుడిని స్థానికులు టూటౌన్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా నిందితుడు ఇంకా ఎక్కడెక్కడ చోరీలు చేశాడు అనే కోణంలో విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని టూటౌన్ సీఐ సురేశ్ తెలిపారు.