చండూరు,జనవరి 21 : బాలికల సంరక్షణ అందరి బాధ్యత అని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత అన్నారు. శనివారం చండూరు కేజీబీవీ పాఠశాలలో స్వరక్షా డే కార్యక్రమాన్ని నిర్వహించి బాలికలకు అవగాహన కల్పించారు. బాలికలు రక్షణ పొందేందుకు చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098ను వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మంజుల, సూపర్వైజర్ శిరీష, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మునుగోడులో..
మునుగోడు : బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ‘స్వరక్షా డే’ సందర్భంగా శనివారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మునుగోడు కస్తూర్బాగాంధీ పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో సీడీపీఓ కవిత మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయలన్నారు.గుడ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏసీడీపీఓ వెంకటమ్మ, హెచ్ఎం యాదయ్యగౌడ్, సర్పంచ్ మిర్యాల వెంకన్న, ఎంపీటీసీ శ్రావణి, అంగన్వాడీ సూపర్వైజర్లు సరస్వతి, రంగమ్మ, కేజీబీవీ ప్రత్యేకాధికారి సంధ్యారాణి పాల్గొన్నారు.
కట్టంగూర్లో…
కట్టంగూర్ : మండలంలోని పామనుగుండ్ల ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆడపిల్లల హక్కులు, చట్టాలు, బాధ్యతలు, పరిశుభ్రత, రక్తహీనత, నివారణపై సూపర్వైజర్ పద్మావతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల హెచ్ఎం రాధిక, ఉపాధ్యాయులు విజయ, రమాదేవి, అంగన్వాడీ టీచర్లు ఎం.మంగమ్మ, పరమేశ్వరీ, నవనీత, ఇందిర, సిబ్బంది పాల్గొన్నారు.
శాలిగౌరారంలో…
శాలిగౌరారం : ఆడపిల్లలు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలని అంగన్వాడీ సూపర్వైజర్ భవానీ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ ఆశ్రమ పాఠశాలలో బాలికా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల విద్యార్ధులచే ప్రతిజ్ణ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ ఉమాదేవి, అంగన్వాడీ టీచర్లు రేణుక, సంధ్య, విమల, ఎల్లమ్మ, కరుణ, స్వరూప పాల్గొన్నారు.
మర్రిగూడలో…
మర్రిగూడ : ఆడపిల్లల చదువును ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మర్రిగూడ క్లస్టర్ ఐసీడీఎస్ యశోద అన్నారు. శనివారం మండలంలోని అజిలాపురంలో బేటి పడావో బేటి బచావో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహంచి ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో సూపర్వైజర్ యశోద, సర్పంచ్ డి. అనసూయ, హెచ్ఎం మంజులత, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
నార్కట్పల్లిలో…
నార్కట్పల్లి : సామాజిక వ్యవస్థపై బాలికలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్థానిక ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. శనివారం జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని చిన్ననారాయణపురం గురుకుల పాఠశాలలో ప్రజ్వల ఎన్జీఓ సంస్థ ద్వారా బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఇటీవల మైనర్ వివాహాలు, అత్యాచారాలు ఎక్కువ అవుతున్నందున ఎప్పటికప్పుడు అధికారులు బాలికలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ నకిరేకల్ సీడీపీఓ అష్రా అంజామ్, సర్పంచ్ కొత్త నర్సింహ, భీష్మాచారి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రమ, సునీత, జ్యోతి పాల్గొన్నారు.
నల్లగొండలో…
రామగిరి నల్లగొండలోని మాన్యం చెల్క(44వ వార్డు)లోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళాశక్తి కేంద్రం కోఆర్డినేటర్స్ సునీత, రెబ్కా పలు అంశాలపై బాలికలు, మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రణిత, సఖీ కేంద్రం కౌన్సిలర్ డీవీ సునీత, నాగమణి, అంగన్వాడీ టీచర్, మహిళలు పాల్గొన్నారు.