నాంపల్లి: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మునుగోడు మాజీ శాసన సభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సుంకిశాల గ్రామ మాజీ సర్పంచ్, 20 మంది కాంగ్రెస్ నాయకులు కలకొండ దుర్గయ్య, నాం పల్లి ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత అధ్వర్యంలో ప్రభాకర్రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సం క్షేమ పథకాలకు ఆకర్షితులై అన్నిపార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.
పార్టీలో చేరిన వారిలో అడేపల్లి సత్యనారాయణ, జింకల యాదయ్య, కలకొండ వెంకటయ్య, ఎరుకల శ్రీను, లక్ష్మయ్య, నేతళ్ల సుఖేందర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మండల రైతుబంధు మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, నాయ కులు పోగుల వెంకట్రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కడారి శ్రీశైలం యాదవ్, నడింపల్లి యాదయ్య, నేతళ్ల అంజనేయులు పాల్గొన్నారు.