అర్వపల్లి, డిసెంబర్ 04 : రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ లను జాగ్రత్తగా జారీ చేయాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడెం ఎంపిడిఓ కార్యాలయంలలో స్టేజ్ 1, 2 రిటర్నింగ్ అధికారులు, పంచాయతీ సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. మొదటి విడత ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది కోసం సంబంధిత ఎంపిడిఓ కార్యాలయంలో డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 9 వరకు ఫెసిలిటీషన్ సెంటర్ ను ఏర్పాటు చేసి అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి స్టేజి 1 ఆర్ఓలు 37 ఏ రిజిస్టర్ లో సర్వీస్ ఓటర్ల వివరాలు నమోదు చేయాలన్నారు. స్టేజి 2 ఆర్ఓలు 37 సి రిజిస్టర్ లో ఎన్నికల విధులు నిర్వహించే వారి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.
– ఫారం -14 తో పాటు సరైన సర్టిపికెట్స్ జతపరిస్తే మార్క్డ్ కాపీలో మార్క్ చేసి పోస్టల్ బ్యాలెట్ మొదటి నుండి వరస క్రమంలో జారీ చేయాలని సూచించారు.
– రిటర్నింగ్ అధికారులు సంబంధిత గ్రామ పంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని మౌలిక వసతులు ఉన్నాయో లేవో పరిశీలించాలని, అలాగే పోలింగ్ తర్వాత ఓట్లను కౌంటింగ్ చేయుటకు తగ్గిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
– జాజిరెడ్డిగూడెం మండలంలో 17 గ్రామ పంచాయతీలకు 64 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 152 వార్డులకు 343 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు కలెక్టర్ కు ఎంపిడిఓ వివరించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీకాంత్, ఎంపిడిఓ ఝాన్సీ, ఎంపిఓ గోపి పాల్గొన్నారు.