నీలగిరి, డిసెంబర్ 8 : జిల్లాకేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో తొలిరోజు గురువారం నిర్వహించిన ఈవెంట్స్ పోటీల్లో 44.5శాతం మంది అర్హత సాధించారు. ఈవెంట్స్కు 600మందికి గాను 483 మంది హాజరవగా 215మంది అర్హత సాధించారు. ఉదయం నాలుగున్నరకే అభ్యర్థులం తా స్టేడియానికి రాగా పోలీస్ యంత్రాంగం ఆరు గంటలకు పోటీలు ప్రారంభించారు. సుమారు 10గంటల నిడివిలో పలువురు అభ్యర్థులకు కేటాయించిన సమయాన్ని బట్టి ఈవెంట్స్ నిర్వహించారు.
ఈవెంట్స్ నిర్వహణను ప్రత్యేకాధికారి పి.శ బరీస్, సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. జనవరి 4వ తేదీ వరకు ఈవెంట్స్ కొనసాగనున్నాయి. అనివార్య కారణాల వల్ల తొలిరోజు ఈవెంట్స్కు హాజరు కాలేకపోయిన 117మ ందికి మరోసారి సమయం ఇవ్వనున్నట్లు పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది. పోటీలు పారదర్శకంగా నిర్వహణకు పోలీస్ యంత్రాంగం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రతి ఈవెంట్ వద్ద బయోమెట్రిక్ పద్ధతి అమలుతో పాటు ఆర్ఎఫ్ఐడీ డిజిటల్ విధానంతో అభ్యర్థులకు పరీక్షలు చేస్తూ సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు.
సౌకర్యాల కల్పనతో పాటు పర్యవేక్షణ
అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ అధికారులు అన్ని సౌకార్యలు ముందస్తుగానే కల్పించారు. దీంతో తొలిరోజు పోలీస్ ఈవెంట్స్ ప్రశాంతంగా ముగిసాయి. అభ్యర్థులకు గాయలైనట్లయితే ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆరోగ్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. ఈవెంట్స్ను ఏఎస్పీ ఏఆర్కే.ప్రసాద్రావు నోడల్ అధికారిగా దేహదారుఢ్య పరీక్షలు పరిశీలించారు. డీఎస్పీ సురేశ్కుమార్, రమేశ్ రవి, ఎస్బీ డీఎస్పీ మొగిలయ్య, సీఐలు రౌతు గోపి, అదిరెడ్డి, జీ.శ్రీనివాస్, ఆర్ఐలు హరిబాబు, సంతోష్, నర్సింహాచారితో పాటు పలువురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించారు.