నల్లగొండ, మార్చి 24 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణ పేదల సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ ఆర్డీఓ కార్యాలయం సోమవారం ఎదుట ధర్నా చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి హాజరై మాట్లాడుతూ హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా పేదలకు రూ.12వేలు ఇస్తామని చెప్పిన అనేక కొర్రీలతో పెట్టిందని, పట్టణ ప్రాంత ప్రజలను దూరం పెట్టిందని మండిపడ్డారు. భూముల్లేని పేదలు పట్టణాల్లో ఉన్నంత మాత్రాన అర్హులు కాదా అని ప్రశ్నించారు. గ్రామాల్లో భూములు లేక, పనుల్లేక పట్టణాలకు వచ్చి అడ్డాకూలీలుగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిని ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు.
లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని కోరారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం సూపరింటెండెంట్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషం, పట్టణ పేదల సంఘం అధ్యక్షుడు దండంపల్లి సత్తయ్య, ఎండీ సలీమ్, తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నర్సింహ, దండంపల్లి సరోజ, మైల యాదయ్య, కోట్ల అశోక్ రెడ్డి, గాదె నర్సింహ, భూతం అరుణ, మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.