తిప్పర్తి, నవంబర్ 3 : ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మి మోసపొవద్దని, అభివృద్ధ్ది చేసే వారికే మళ్లీ బీఆర్ఎస్కు పట్టం కట్టాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లమ్మగూడెం, ఆరెగూడెం, మామిడాల, గోదావరిగూడెం, యాపలగూడెం, ఇం డ్లూరు, వెంకటాద్రిపాలెం, పజ్జూరు, ఎర్రగడ్డలగూడెం, సోమోరిగూడెం గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆయా గ్రామాల్లో కంచర్ల భూపాల్రెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 యేండ్లలో చేయలేని అభివృద్ధ్దిని ఐదేండ్లు చేసి చూపించానని, మామిడాల వద్ద బ్రిడ్జి నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో రూ.కోట్లతో సీసీ రోడ్లు ఇతర మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. రెండోసారి ఎమ్మెల్యే ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరికీ అండగా మరింతగా సేవ చేస్తానన్నారు.
మండలంలోని మామిడాల గ్రామానికి చెందిన వివిధ పార్టీల 10 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్, చాడ కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్రెడ్డి, సీనియర్ నాయకులు లొడంగి గోవర్దన్, జీడిపల్లి వెంకట్రెడ్డి, ఏనుగు వెంకట్ రెడ్డి ,వి.నాగేశ్వర్రావు, ఎంపీటీసీ సందీప్రెడ్డి, సర్పంచులు గాదె సంధ్య, కడారి మంగమ్మ, మార్త శ్రీదేవి, మోయిజ్, నాయకులు కందుల లక్ష్మయ్య, బొల్లెద్దు వెంకన్న, నవీన్, సైదులు ,జ్యోతి, పాల్గొన్నారు.
నల్లగొండ సిటీ : కనగల్ మండలం ఎంగౌరారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు మండలి పరమేశ్, బీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి మండలి సరితాఆంజనేయులు, ఉపసర్పంచ్ నాగులవంచ శ్రవణ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొందరి మాయ మాటలు నమ్మి కాంగ్రెస్లో చేరారని, తిరిగి సొంత గూటికి రావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడే గోన రవీందర్రావు, మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్యగౌడ్, వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్రావు, గౌరారం సర్పంచ్ నాగులవంచ సులక్షణాశేఖర్రావు పాల్గొన్నారు.