కోదాడ: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
సెప్టెంబర్ 2న నియోజకవర్గ వ్యాప్తంగా జెండా పండుగను నిర్వహించి గ్రామ, వార్డు కమిటీలను మొదలు పెట్టాలని నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ వార్డు కమిటీలు వేయాలని అన్నారు. 12 నుంచి 20 వరకు మండల కమిటీ వేయాలని సూచించారు. కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు 51శాతం కమిటీలకు ఉండే విధంగా చూడాలన్నారు.
క్రియాశీలకంగా పనిచేసే వారికి కమిటీల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణీపుల్లారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, అజయ్కుమార్, వనపర్తి లక్ష్మీనారాయణ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.