పట్టణాల్లోనూ కొనసాగుతున్న పారిశుధ్య పనులు
మూడో రోజు జిల్లా వ్యాప్తంగా ప్రగతి కార్యక్రమాలు
పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్రెడ్డి
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అధికారుల భాగస్వామ్యం
సూర్యాపేట, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి, నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామాలు, పట్టణాల్లో పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం మూడో రోజు ఆదివారం పారిశుధ్య పనులు చేపట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ప్రజలతో కలిసి రోడ్లు, మురుగు కాల్వలను శుభ్రం చేయడంతోపాటు ఓవర్హెడ్ ట్యాంకులను క్లీన్ చేశారు.
సూర్యాపేట జిల్లా ఏపూరు, నల్లగొండ జిల్లా భీమారం గ్రామాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. వారితోపాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, సూర్యాపేట చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేంధర్రావు, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మున్సిపాలిటీలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : యాద్గార్పల్లిలో గ్రామస్తులతో కలిసి చెత్తను తొలగిస్తున్న సర్పంచ్ యాదమ్మ
చిట్యాల : ఉరుమడ్ల గ్రామంలో చెత్తను తొలగిస్తున్న సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ సత్తయ్య యాదవ్
పెద్దవూర మండలంలోని వెల్మగూడెంలో గ్రామస్తులతో కలిసి వీధులను శుభ్రం చేస్తున్న సర్పంచ్ రావుల శ్రీను, గ్రామస్తులు