దేవరకొండ, డిసెంబర్ 3 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనవారం ఆయన సమక్షంలో చింతపల్లి మండలంలోని తిదేడు గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన ఐదు కుటుంబాల వారు టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యధికంగా రిజర్వాయర్ల పనులు చేపడుతుండడంతో ప్రతి ఎకరానికీ సాగునీరు అందుతుందన్నారు. ఈ నేపథ్యంలో పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. రైతులకు అండగా సీఎం కేసీఆర్ ఉంటారన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పార్టీలో చేరిన వారిలో మర్రు శ్రీనివాస్రావు, జక్కుల వెంకటయ్య, రామలింగం, రాములుయాదవ్ ఉన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, గోవర్ధనాచారి, పురుషోత్తంరెడ్డి, ఉలుపాల శేఖర్, పాపయ్య, బి.కృష్ణ పాల్గొన్నారు.