నల్లగొండ : కరోనా సోకిందన్న భయంతో ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తున్నది. కొవిడ్ బారినపడ్డామన్న భయంతో నల్లగొండ జిల్లాలో వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చండూరు మండలం చామల్లపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గొడ్డేటి వెంకులు (60) అనారోగ్యానికి గురయ్యాడు. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఈ ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.