రామగిరి, డిసెంబర్ 21 : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ 1, 5 పరీక్షలు సజావుగా జరిగినట్లు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు వెల్లడించారు.
గురువారం తెలుగు పరీక్షలు జరిగాయని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరుగకుండా వర్సిటీ పరీక్షల విభాగం నుంచి అన్ని పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్కాడ్స్ పర్యవేక్షణ చేసినట్లు చెప్పారు.