కేతేపల్లి, ఫిబ్రవరి 19 : మూసీ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు సోమవారం అధికారులు నాలుగో విడుత నీటిని విడుదల చేశారు. 10 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. ఆయకట్టులో పంటల సాగుకు అవసరమైన విధంగా మరో రెండు తడులు నీటిని వదలనున్నట్లు ప్రాజెక్టు ఏఈ డి.ఉదయ్కుమార్ తెలిపారు.
రెండు కాల్వలకు కలిపి మొత్తం 313.20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులు కాగా ప్రస్తుతం 633.95(2.00 టీఎంసీలు)అడుగులు ఉన్నది.