తుంగతుర్తి, జనవరి 19 : తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో నర్సరీ పనులను సోమవారం సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ ప్రారంభించారు. నాణ్యమైన విత్తనాలు నాటి, లక్ష్యానికి అనుగుణంగా పూలు, పండ్ల మొక్కలను పెంచాలని సిబ్బందికి సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అజిత ప్రసాద్, పంచాయతీ కార్య దర్శి జగదీష్, ఫీల్డ్ అసిస్టెంట్ యల్లయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.