నల్లగొండ : నకిరేకల్ లో సమీకృత మార్కెట్ ప్రజలందరికీ అందుబాటులోఉండాలనే ఉద్దేశంతోనే మంత్రి జగదీష్ రెడ్డి సహాయ సహకారాలతో నకిరేకల్ ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
నకిరేకల్ లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఏనాడు ప్రజల బాగోగులు పట్టించుకోని కొంతమంది నాయకులు మార్కెట్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
నా పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.
అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోలేరరని స్పష్టం చేశారు. పనీపాటలేకే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. పగటి వేశగాళ్ళ మాటలు నమ్మకండని ప్రజలకు హితవు పలికారు.
కోట్ల రూపాయలతో నకిరేకల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామనని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలను ప్రచారం చేస్తున్న వారిపై మేము కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.